భారీ సంఖ్యలోని డ్రోన్లతో రష్యాపై ఉక్రెయిన్ దాడి చేసింది. భారతీయ కార్మికుడితో సహా నలుగురు మరణించారు.
మరో ముగ్గురు భారతీయ కార్మికులు, మరి కొందరు గాయపడ్డారు. రష్యాలోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ధృవీకరించింది. దాడి జరిగిన ప్రదేశాన్ని అధికారులు సందర్శించారని, గాయపడిన కార్మికులను ఆసుపత్రిలో పరామర్శించినట్లు తెలిపింది. ఆదివారం తెల్లవారుజామున రష్యాపై భారీ స్థాయిలో డ్రోన్ దాడులకు ఉక్రెయిన్ పాల్పడింది. రష్యా రాజధాని మాస్కోలోని కొన్ని ప్రాంతాలు, సమీప ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి.