సిద్దపేట జిల్లాలో విషాదంలో చోటు చేసుకుది. హల్ది వాగులో ఈతకోసం వెళ్లి వర్గల్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు మృతి చెందారు. నర్సాపూకు చెందిన ప్రశాంత్ యాదవ్(27) వికాస్(27 ఆనంద్ రెడ్డి(27) తూప్రాన్లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం ఈతకోసం ముగ్గురు కలిసి హల్ది వాగులో దిగారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ముగ్గురు మృతి చెందారు. గమనించిన స్థానికులు మృదేహాలను వెలికితీశారు. ముగ్గురు స్నేహితుల మృతితో నర్సాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి.