
అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని మూడు రోజుల పాటు అధికారులు విచారించారు. మొదటి రోజు మైనింగ్ కేసుకు సంబంధించి 22 ప్రశ్నలను పోలీసులు సంధించారు. వాటికి సరైన సమాధానం చెప్పలేదట. ఇవన్నీ తప్పుడు కేసులంటూ విచారణ అధికారికి బదులిచ్చారు. కొన్ని ప్రశ్నలకు ఆయన మౌనమే సమాధానం. అవగాహన లేదు, గుర్తులేదు, మర్చిపోయా.. అంటూ కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.