బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ పర్యటనకు వచ్చారు. శనివారం ఉదయం బీజింగ్ నుంచి బయల్దేరి.. మధ్యాహ్నం దిల్లీకి చేరుకున్నారు. ఏడేళ్లలో ఆయన భారత్కు రావడం ఇదే తొలిసారి. అంతేగాక, 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత ఢిల్లీ వేదికగా ఇరుదేశాలు పాల్గొన్న తొలి ఉన్నతస్థాయి సమావేశం ఇదే. ఈ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ- జిన్ పింగ్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది.