గత కేసీఆర్ పాలనలో తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేశారని డిప్యూటీ సీఎం భట్టి ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం మొత్తం రూ.8.21 లక్షల కోట్ల అప్పులు చేసిందని అధికారిక లెక్కలను వెల్లడించారు. ఇందులో వివిధ విభాగాలకు సంబంధించి చెల్లించకుండా వదిలేసిన వేల కోట్ల బకాయిలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ సాగించిన పాలన అంతా అబద్ధాల పునాదులపైనే నడిచిందని విమర్శించిన భట్టి.. ఈ భారీ అప్పులపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.