బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో హిందూ నేత విజయం సాధించారు. ఆ దేశ రాజధాని డాకాలో విజయఢంకా మోగించారు.బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై వరుస దాడులు, హత్య ఉదంతాలు వెలుగుచూస్తున్న వేళ దేశ రాజధాని ఢాకాలోని కీలకమైన ఢాకా-3 నియోజకవర్గం నుంచిబంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అభ్యర్థిగా పోటీ చేసిన గాయేశ్వర్ చంద్ర రాయ్ అనూహ్య విజయాన్ని అందుకున్నారు. జమాత్-ఏ-ఇస్లామీ అభ్యర్థి మహమ్మద్ షాహినూర్ ఇస్లాంపై ఆయన గెలుపొందారు.

