ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దళం మంగళవారం దాడులు జరిపింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఈ దాడికి బాధ్యత వహించింది. హమాస్ అగ్రశ్రేణి ఉగ్రవాద నాయకులపై నేటి చర్య పూర్తిగా స్వతంత్ర ఆపరేషన్ అని.. ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ను ప్రారంభించి.. నిర్వహించిందని.. దీనికి ఇజ్రాయెల్ పూర్తి బాధ్యత వహిస్తుందని పీఎం కార్యాలయం పేర్కొంది.

