థాయ్లాండ్, కంబోడియా. మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలలో ఓ సైనికుడితోపాటు 15 మంది మరణించారు. తాజా ఉద్రిక్తతలతో భారత్ అప్రమత్తమైంది. ఈ మేరకు భారతీయుల కోసం థాయ్లాండ్లోని భారత రాయబార కార్యాలయం కీలక అడ్వైజరీ జారీ చేసింది. భారత పౌరులు థాయ్లోని ఏడు ప్రావిన్స్లవైపు ప్రయాణించొద్దని సూచించింది. ఉబోన్ రాట్చథాని, సురిన్, సిసాకెట్, బురిరామ్, సా కాయో, చంతబురి, ట్రూట్.. ఈ ఏడు ప్రావిన్స్లకు దూరంగా ఉండాలని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.

