తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంధనవాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రత్యేకంగా భేటీ అయింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో సెమీ కండక్టర్ల పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సింగపూర్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు గల అనుకూలతలను, ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను సీఎం రేవంత్ వారికి సమగ్రంగా వివరించారు.