వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఐదుగురు ఎమ్మెల్సీలు ఇప్పుడు మండలి ఛైర్మన్ మోషేనురాజుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. తమ రాజీనామాలను ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నారనే ఆగ్రహంతో ఉన్న ఈ సభ్యులు, ఛైర్మన్ తీరును నిరసిస్తూ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఐదుగురు సభ్యులు పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ తమ పదవులకు ఇప్పటికే రాజీనామా చేశారు.

