చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి బృందంతో సమావేశమైన బీజేపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాఠే. అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో చైనా గ్రామాలను ఆక్రమిస్తుంటే, ఇక్కడ నేతలు ఆలింగనం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో చైనా కమ్యూనిస్టు నేతలతో సమావేశమైన ఫొటోను ఎక్స్లో పోస్ట్ చేశారు. వారితో సమావేశమైనా బీజేపీని ప్రశ్నించడంలో మీడియా విఫలమైందని దుయ్యబట్టారు.

