
మహిళల వన్డే వరల్డ్ కప్లో భారత జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. సెమీస్ రేసులో ముందంజ వేయాలంటే గెలిచితీరాల్సిన మ్యాచ్లో టీమిండియా పోరాడి ఓడింది. ఉత్కంఠ పోరులో స్మృతి మంధాన(88), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (70), దీప్తి శర్మ(650)లు అర్ధ శతకాలతో మెరిసినా జట్టును గట్టెక్కించలేకపోయారు. చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. వరుసగా నాలుగు విజయాలతో నాట్ సీవర్ బ్రంట్ సేన సెమీస్కు దూసుకెళ్లింది.