త్వరలోనే కొత్త పార్టీ స్థాపించబోతున్నట్లు విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. పార్టీ సీఎం అభ్యర్థిగా తాను ఉండనని, అంతేగాకుండా కుటుంబ సభ్యులెవరూ తన పార్టీలో ఉండబోరన్నారు. ఇప్పటివరకు అధికారాన్ని రెండు కుటుంబాలే అనుభవిస్తున్నాయని తెలిపారు. టీడీపీ రెడ్ బుక్ పార్టీ అయితే, వైసీపీ రప్పా.. రప్పా.. పార్టీ అని ధ్వజమెత్తారు. అధికారమంటే కేవలం రెడ్లు, కమ్మ కులాలకు పరిమితం కాదని విజయసాయి రెడ్డి అన్నారు. బీసీల్లో ఎంతో మంది సామర్థ్యం ఉన్నారని, వారికి అవకాశం దక్కాలనేదే తన లక్ష్యమన్నారు.