సీఆర్డీఏ సమావేశంలో ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024 జూన్ నుంచి భూములిచ్చే వారికి రూ.40వేల కౌలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. భూములు ఇచ్చినప్పటి నుంచి 10ఏళ్లపాటు ఇది అమలు కానుంది. గ్రామకంఠాల్లో భూమి కోల్పోతున్న వారికి ఏటా రూ.10వేలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా పూలింగ్ జరిగే గ్రామాల రైతులకు ుణమాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి 6లోగా రుణం తీసుకున్న వారికి ఈ మాఫీ అమలు అవుతుంది. →