కెన్యాలో ఓ బాలికల స్కూల్ హాస్టల్ డార్మెటరీలో మంటలు చెలరేగిన ఘటనలో 16 మంది విద్యార్థులు సజీవ దహనం చెందారు.
బోర్డింగ్ స్కూల్ విద్యార్థులకు ఈ డార్మెటరీ మృత్యుపాశం అయింది. తూర్పు ఆఫ్రికా దేశం అయిన కెన్యాలోని గిల్గిల్లో ఈ దారుణం జరిగింది. విద్యార్థినులు భోజనం చేసి ఉన్న దశలో మంటలు చెలరేగాయి. దీనితో వారు తప్పించుకునే వీలు లేక తగులబడ్డారు.పలువురికి కాలిన గాయాలు అయ్యాయి. ఈ దారుణ ఘటన గురించి కెన్యా విద్యామంత్రి జులియస్ ఓగాంబా విలేకరులకు తెలిపారు.