కూకట్పల్లిలోని ప్రముఖ లూలూ హైపర్మార్కెట్లో ఆహార భద్రతా శాఖ కమిషనర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించించింది. ఈ దాడిలో స్వీట్లు, నూనెలు, పిండి, మాంసం, పప్పుధాన్యాలతో సహా మొత్తం 150 కిలోగ్రాముల సురక్షితం కాని ఆహార పదార్థాలను ఆహార భద్రతా అధికారులు స్వాధీనం చేసుకుంది. ఈ లూలూ హైపర్మార్కెట్లో అనేక ఉత్పత్తులకు FSSAI లైసెన్స్ కూడా లేదు. రిఫ్రిజిరేటర్లలో మిగిలిపోయిన ఆహారం నిల్వ చేసినట్లు, పైగా షాప్ లోపల నేలంతా పురుగులతో అపరిశుభ్రంగా ఉంది. శనగపిండి, గోధుమ పిండి, పప్పుల ప్యాకెట్లలో సైతం పురుగులు కనిపించాయి.