కుండపోత వర్షాలు జమ్మూ అంతటా విధ్వంసం సృష్టించాయి. ప్రభుత్వ గాంధీ మెమోరియల్ (GGM) సైన్స్ కళాశాల, క్లస్టర్ విశ్వవిద్యాలయం ప్రాంగణం చిన్నపాటి చెరువును తలపించింది. విద్యార్థులు తమ బ్యాగులను తలపై మోసుకుంటూ వదల్లోంచి బయటకు వెళ్తున్నారు.హాస్టళ్లు, తరగతి గది భవనాలు వంటి లోతట్టు ప్రాంతాలలోకి నీరు ప్రవేశించటంతో సాధారణ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యా భవనాలకు ప్రవేశం దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు.

