మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంకు చెందిన నరేష్ (38) అనే వ్యక్తి నారాయణ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తాడు. గుండెలో చిన్న నొప్పి ఉందని నడుచుకుంటూ హాస్పిటల్ కి వచ్చాడు. పరీక్షించిన వైద్యులు 8 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. 5 లక్షలు రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకొని ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆపరేషన్ చేశాక నరేష్ మృతి చెందాడు. జూనియర్ డాక్టర్లతో ఆపరేషన్ చేశారని, మాకు న్యాయం చేయాలంటూ కామినేని హాస్పిటల్ ముందు నారాయణ కాలేజీ లెక్చరర్స్ కలసి మృతుడి బందువులు ఆందోళన చేపట్టారు.

