ఆగ్నేయ ఇండోనేషియాలోని తనింబర్ దీవుల్లో సోమవారం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది. 10 కి.మీ లోతులో భూకంపం సంభవించినప్పటికీ ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదు. ఇండోనేషియా “రింగ్ ఆఫ్ ఫైర్” లో ఉండటంతో భూకంపాలు సర్వసాధారణం. ఈ ప్రాంతం భూకంపలకు ప్రసిద్ధి చెందింది. ఈ భూకంపం కారణంగా కనీసం 15 ఇళ్లు రెండు పాఠశాల భవనాలు దెబ్బతిన్నాయి, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

