
అనంతపురం నగరంలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని చనిపోయింది. నాలుగైదు రోజులు కిందట కూతురు కనిపించడం లేదని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నగరంలోని రామకృష్ణ నగర్ కు చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని తన్మయి వారం రోజుల క్రితం అదృశ్యం అయింది. అనుమానాస్పదంగా తన్మయి మృతి చెందింది. తన్మయి తండ్రి లక్ష్మీపతి మాట్లాడుతూ ఓ అబ్బాయి మీద అనుమానం ఉందని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. కాల్ లిస్ట్ వచ్చాక చూద్దామన్నారు.