బిజూ జనతాదళ్(బీజేడీ) పార్టీ అధ్యక్షుడు, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ హస్పిటల్లో చేరారు. వయసు సంబంధిత సమస్యల వల్ల ఆయన ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు భువనేశ్వర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ.. శనివారం రాత్రి పట్నాయక్ గారి ఆరోగ్యం కాస్త విషమించింది. ఆదివారం నాటికి పరిస్థితిలో మార్పు లేకపోవడంతో.. ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చామని తెలిపారు.

