పిఎం మోడీ సోమవారం ఆర్మేనియా ప్రధానమంత్రి నికోల్ పాషిన్యాన్తోనూ ప్రత్యేకంగా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ‘బిష్కెక్లో ఆర్మేనియా ప్రధాని నికోల్ పాషిన్యాన్తో అద్భుతమైన సమావేశం జరిగింది” అని మోడీ తెలిపారు. భారత్-ఆర్మేనియా సహకారం రక్షణ, ఐటీ, అంతరిక్షం, విద్య, ఔషధాలు తదితర రంగాల్లో మరింత విస్తరించనుందని మోడీ చెప్పారు. రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను కూడా మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

