పశ్చిమాసియాలో భారతీయ నావికులకు సంబంధించి అనేక సంఘటనలు జరిగాయని, నావికుల సంక్షేమానికి, శ్రేయస్సుకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని, ఈ విషయాన్ని మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. నిన్న, ఒమన్ తీరంలో నౌకపై జరిగిన దాడిని కూడా ఖండించామని, ఈ దాడిలో దురదృష్టవశాత్తు ముగ్గురు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారని జైస్వాల్ తెలిపారు. తమ తీవ్ర నిరసనను తెలియజేయడానికి అమెరికా భద్రతాధిపతిని ఇక్కడికి పిలిపించామన్నారు.

