అమెరికా లో మరోసారి ఐయోవా లోని మస్కటిన్ టౌన్ తూపాకీ తూటాలతో రక్తమోడింది. ఈ కాల్పుల ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. 210, పార్క్ అవెన్యూలోని ఒక నివాసంలో కాల్పులు జరిగినట్లు సమాచారం ఈ కాల్పులకు పాల్పడ్డ మస్కటిన్కే చెందిన 52 ఏళ్ల ర్యాన్ విల్లిస్ మెక్ఫార్లాండ్ అతన్ని లొంగిపోవాలని పోలీసులు హెచ్చరిస్తుండగానే అతను తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.