
రేణు దేశాయ్ తన ఇన్స్టాలో రాస్తూ..’ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా పండుగ జరుపుకునే సమయమని నాకు కూడా తెలుసు. కానీ రాత్రి 9 గంటల తర్వాత చాలా ఎక్కువుగా శబ్ధం వచ్చే క్రాకర్లు పేల్చకండి. చాలా మంది వృద్ధులు, చిన్న పిల్లలు ఆ విపరీతమైన శబ్దాలకు ప్రభావితమవుతారు. ఈ సమయంలో మీరు చాలా మెరుపులు, పూల కుండలు, చక్రాలతో ఆనందించండి. ఎక్కువ శబ్దం చేయకుండా కేవలం లైటింగ్తో పండుగను మరింత ఆనందంగా జరుపుకోండి’ అంటూ విజ్ఞప్తి చేసింది.