హాంగ్కాంగ్ మీడియా టైకూన్ జిమ్మీ లాయ్ కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. హాంగ్కాంగ్ స్థానిక కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. జాతీయ భద్రతా నేరానికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. చైనా తన వివాదాస్పద జాతీయ భద్రత చట్టం కింద ఈ శిక్షను విధించింది. జిమ్మీ లాయ్ .. చైనాకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. యాపిల్ డెయిలీ పత్రికతో చైనాకు వ్యతిరేకంగా ఎన్నో కథనాలు రాశారు. ఆ పత్రికలో పనిచేసిన మరో ఆరు మంది మాజీ ప్రతినిధులకు కూడా జైలుశిక్ష విధించారు.

