పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరమైన వేళ.. శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌకపై దాడి చోటుచేసుకోవడం కలకలం రేగుతోంది. ఈ నౌక విశాఖలో జరిగిన మిలాన్లో పాల్గొని, తమ దేశానికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇందులో మొత్తం 180 మంది సిబ్బంది ఉండగా.. 101 మంది గల్లంతయ్యారు. మరో 32 మందిని శ్రీలంక నేవీ రక్షించింది. ఈ నౌకకు ఎస్కార్ట్గా మరో రెండు నౌకలు వెళ్తున్నాయి. కానీ, ఈ దాడి ఎలా జరిగిందో తెలియరాలేదు.

