వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి నేడు గవర్నర్తో సమావేశం కానున్నారు. లోక్భవన్లో ఈ భేటీ జరగనుంది. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని చంద్రబాబు చూస్తున్నారని దాన్ని అడ్డుకోవాలని రిక్వస్ట్ చేయనున్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటికరిస్తున్నారని ఆరోపిస్తూ రెండు నెలల క్రితం వైసీపీ ఉద్యమం చేపట్టింది. రెండు నెలల్లోనే కోటీ 4 లక్షల 11వేల 136 మంది సంతకాలు చేశారని వైసీపీ చెబుతోంది. ప్రతి గ్రామంలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారని వివరించింది.

