ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇవాళ ఖమ్మం బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఈ సందర్భంగారెండు టీవీ ఛానెల్లు స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులను వివాదంలోకి లాగవద్దని సూచించారు. ఆ రెండు ఛానెళ్ల యాజమాన్యాల మధ్య గొడవలు ఉంటే వాళ్లు తలుపులు మూసుకుని కొట్టుకోవాలని సీఎం వ్యాఖ్యానించారు. అంతేతప్ప రాజకీయ నాయకులను ఆ గొడవల్లోకి లాగొద్దని చెప్పారు. తన మంత్రుల మీద తప్పుడు ప్రచారాలు చేసినా, వారిని బదనాం చేసినా బాగుండదని హెచ్చరించారు. అదేవిధంగా ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు.

