మాలేగావ్ పేలుళ్ల కేసులో నిర్దోషిగా విడుదలైన మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ భోపాల్లో అడుగు పెట్టగానే కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. తనపై కేసు కాంగ్రెస్ కుట్ర అని, ఆ పార్టీపై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువులను వేధించిందని ఆరోపించారు. తొమ్మిదేళ్లు జైలు జీవితం గడిపిన ఆమె.. తన ఆరోగ్య సమస్యలకు పోలీసుల చిత్రహింసలే కారణమని అన్నారు. ఈ పరిణామాలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

