ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు ఉండగా… మూడు కొత్త జిల్లాలు మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరంల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని… కొత్తగా ఏర్పడే మదనపల్లె జిల్లాలో విలీనం చేస్తారు. అంటే కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినప్పటికీ… ఒక జిల్లాను తొలగించడంతో రాష్ట్రంలో జిల్లాల మొత్తం సంఖ్య 28కి పెరగనుంది. తుది గెజిట్ నోటిఫికేషన్ రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

