పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతం మరోసారి రక్తసిక్తమైంది. సోమవారం ట్యాంక్ జిల్లాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్ సాయుధ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన భీకర బాంబు పేలుడులో ఏడుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. నిషిద్ధ ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) కు చెందిన ఒక ప్రత్యేక విభాగం ఈ ఘాతుకానికి పాల్పడింది. రోడ్డు పక్కన అమర్చిన అత్యంత శక్తివంతమైన రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీని.. పోలీస్ వాహనం వెళ్తుండగా పేల్చివేశారు.

