
నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారు చేసి విదేశాలకు పంపుతున్న ఇద్దరు నిందితులను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి మధురై కామరాజ్ యూనివర్సిటీ కి చెందిన 13 నకిలీ మెమోలు, నకిలీ డిగ్రీ మార్కుల సర్టిఫికెట్ లు వివిధ కంపెనీలకు బ్యాంకులకు చెందిన స్టాంపులు, 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అశోక్ ధనలక్ష్మి ఓవర్సీస్ అబ్రాడ్ స్టడీ, వీసా కన్సల్టెన్సీ ఇప్పటి వరకు దాదాపు 15 మంది విద్యార్థులను పంపించినట్లు దర్యాప్తులో తేలింది.