ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం సంభవించింది. పవర్ ప్లాంట్లో బాయిలర్ పేలుడు సంభవించి, 9 మంది కార్మికులు మృతి చెందారు. శక్తి జిల్లా, సింగితరాయ్లోని వేదాంత పవర్ ప్లాంట్లో మధ్యాహ్నం సుమారు 2 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలుడు సంభవించడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో సుమారు 30 మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా, వారిలో తొమ్మిది మంది చికిత్స పొందుతూ మరణించారు. గాయపడిన మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

