ఉత్తరప్రదేశ్లోని గోండాలో ఈ నెల 10 నుండి 12 వరకు జరగనున్న నేషనల్ రెజ్లింగ్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న వినేశ్ ఫొగాట్, తన భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ టోర్నీలో తనకు కానీ, తన జట్టు సభ్యులకు కానీ ఎలాంటి అపశ్రుతి జరిగినా దానికి భారత ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆమె స్పష్టం చేశారు. ఒక అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి స్వదేశంలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు భద్రతను కోరడం, వ్యవస్థల పట్ల ఆమెకు ఉన్న అభద్రతా భావాన్ని అద్దం పడుతోంది.

