దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ రాకముందు చదువులేని వ్యక్తులే ఎక్కువగా రాజకీయాల్లో ఉండేవారని,చదువుకున్న వారికే ఎన్టిఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. చదువుకున్న వారికే ఎన్టిఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడటానికే ఎన్టిఆర్ పార్టీ పెట్టారని తెలియజేశారు. టిడిపి కేంద్ర కార్యాలయంలో ఎన్టిఆర్ వర్దంతి కార్యక్రమం జరిగింది. ఎన్టిఆర్ విగ్రహానికి సిఎం పార్టీ నేతలతో కలిసి నివాళులర్పించారు.

