ఈ నెల 8, 9 తారీఖుల్లోతెలంగాణ గ్లోబెల్ రైజింగ్ – 2025 సమ్మిట్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. 8 న మధ్యాహ్నం 1:30 కు తెలంగాణ గ్లోబెల్ రైజింగ్ 2025 సమ్మిట్ను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ, వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్ ఆరంభ వేడుకలో ప్రసంగించనున్నారు.