
ఏపీ కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తయ్యింది. ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాదైన సందర్భంగా సీఎం చంద్రబాబు ట్వీట్ ట్వీట్ చేశారు. జూన్ 4న ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు అని జూన్ 4 ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు అని వ్యాఖ్యానించారు. ఏపీ దశదిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పునకు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు నమస్కారాలంటూ సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.