ప్రధాని నరేంద్ర మోదీ X (ట్విట్టర్)లో ఒక ముఖ్యమైన పోస్ట్ చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని ఫుజైరా పెట్రోలియం ఇండస్ట్రీస్ జోన్పై మే 4న ఇరాన్ చేసిన దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో ముగ్గురు భారతీయులు గాయపడ్డారు. “పౌరులపై, మౌలిక సదుపాయాలపై దాడులు చెయ్యడం ఆమోదయోగ్యం కాదు” అని మోదీ స్పష్టం చేశారు. భారత్ తరపున UAEకి మోదీ బలమైన సానుభూతి ప్రకటించారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని మోదీ సూచించారు.

