తెలంగాణ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై కొన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు కంప్యూటర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. ఈ నిర్ణయం జూనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ కమ్ టైపిస్టులు, సీనియర్ స్టెనోగ్రాఫర్లు, జూనియర్ స్టెనోగ్రాఫర్లు, U.D. టైపిస్టులు, L.D. టైపిస్టులు, టైపిస్టులు వంటి వర్గాల వారికి వర్తిస్తుంది. ఉద్యోగులు కంప్యూటర్ పరీక్షలో మాత్రమే కాకుండా, ఆఫీసు ఆటోమెషినలో ప్రావీణ్యం కూడా కలిగి ఉండాలి. దీని కోసం డిపార్ట్మెంటల్ పరీక్ష నిర్వహించి, ఉత్తీర్ణులు కావాలని G.O.237 ద్వారా అధికారికంగా జారీ చేసింది.

