వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆసుపత్రి చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. రెండు వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ త్వరితగతిన కోలుకోవడంతో కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కో-ఆర్డినేటర్ ముద్రగడ గిరి మీడియాకు తెలిపారు.

