తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తోందని… పిసి ఘోష్ కమీషన్ నివేదికను కూడా ఇందులో భాగమేనని బిఆర్ఎస్ అధినేత పేర్కొన్నారు. కాబట్టి ఈ కమీషన్ నివేదికపై స్టే ఇవ్వాలని ఆయన కోరారు. ఇలా కేసీఆర్, హరీష్ రావు దాఖలుచేసిన పిటిషన్లపై రేపు (బుధవారం) హైకోర్టు విచారణ చేపట్టే అవకాశాలున్నాయి.

