విజయవాడలో జరిగిన ‘మధ్యవర్తిత్వంపై రాష్ట్రస్థాయి సదస్సు’లో న్యాయవ్యవస్థలో మధ్యవర్తిత్వం ప్రత్యామ్నాయం కాదని, ఓ ప్రాధాన్యాంశమని విజయవాడలో జరిగిన ‘మధ్యవర్తిత్వంపై రాష్ట్రస్థాయి సదస్సు’లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. మధ్యవర్తిత్వం భారతీయలు డీఎన్ఏలోనే ఉందని ఉదహరించారు. రెండు పక్షాలకు మేలు చేకూర్చేలా చేయడంలో మధ్యవర్తిత్వానిది కీలక పాత్ర అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కోర్టులపై కేసుల భారం ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యవర్తిత్వాన్ని విస్మరించడం ఏ మాత్రం సహేతుకం కాదన్నారు.

