గవర్నర్ ప్రసంగంపై ధన్యాదాలు తెలిపే తీర్మానంపై శాసన మండలిలో అధికార, విపక్షాల మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది. పరస్పరం సవాళ్లు ప్రతిసవాళ్లతో సభ దద్దరిల్లింది. గవర్నర్ ప్రసంగంలోని అంశాలపై వైఎస్సార్సీపీ సభ్యులు విమర్శలు చేయగా ఆరోపణలను అధికారపార్టీ సభ్యులు దీటుగా తిప్పి కొట్టారు. ఆరోపణలు నిరూపించేందుకు తాము సిద్దమని వైఎస్సార్సీపీ సభ్యులు సవాల్ విసరగా, దమ్ముంటే నిరూపించాలని దీనికి తాముసైతం సిద్దమని అధికారపార్టీ నేతలు ప్రతిసవాల్ విసిరారు.

