తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కన్నీరు పెట్టుకున్నారు. శాసనమండలిలో ఇదే తన చివరి ప్రసంగమంటూ కవిత కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివాసీ సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా సమ్మక్క, సారక్క వైదిక చిహ్నాలను చెక్కారని.. ఇది కరెక్ట్ కాదని అన్నారు. దీనిపై ఆదివాసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయని తెలిపారు. సమ్మక్క – సారక్క జాతరకు దేవాదాయ శాఖ పర్యవేక్షణ కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు.

