వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ ముగ్గురి ఫొటోలను మార్ఫింగ్ చేసి కించపరిచారని వర్మపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి నోటీసులు అందుకున్న వర్మ.. ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు ఎదుట విచారణకు హాజరయ్యారు. గత విచారణ సమయంలో సెల్ ఫోన్ తమకు స్వాధీనం చేయాలని పోలీసులు అడిగితే.. తాను ఫోన్ తీసుకురాలేదని వర్మ సమాధానం చెప్పారు. అయితే, ఈసారి మాత్రం పోలీసులు వర్మను వదల్లేదు. ఆయన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వర్మ సెల్ ఫోన్లో ఆధారాల కోసం పోలీసులు పరిశీలిస్తున్నారు.

