కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ప్రియాంక గాంధీ చేతికి ఇవ్వాలనే వాదనలు బలంగా వినిపిస్తున్న వేళ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటించాలనే డిమాండ్ పెరుగుతుందని.. ప్రజలు ఆమెలో ఇందిరా గాంధీని చూస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ కూడా కష్టపడుతున్నారని, వారి రక్తంలోనే రాజకీయాలు ఉన్నాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ లోని వారసత్వ పోరును మరింత వేడెక్కించాయి.

