సత్వీందర్ సింగ్ అనే క్యాబ్ డ్రైవర్ గత 11 ఏళ్లుగా న్యూజిలాండ్లో ఉంటూ క్యాబ్ నడుపుతున్నాడు. 2023లో ఒక రోజు రాత్రి మైనర్ ప్రయాణికురాలు క్యాబ్ను బుక్ చేసుకుంది. ఈ క్రమంలో సత్వీందర్ సింగ్ జీపీఎస్ను ఆఫ్ చేసి.. కారును మార్గం మళ్లించాడు. అక్కడ మైనర్పై అత్యాచారానికి పాల్పడ్డాడు. సీసీ కెమరాల ఆధారంగా సత్వీందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై తాజాగా అక్కడి న్యాయస్థానం విచారణ జరిపి.. ఏడేళ్లకుపైగా జైలుశిక్ష విధించింది.

