మహిళా రిజర్వేషన్ బిల్లుపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బిల్లును ఇంత తొందరగా ఎందుకు ప్రవేశపెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని, అప్పుడే రిజర్వేషన్ల లెక్కలు స్పష్టమవుతాయని ఆయన అన్నారు. కులగణన జరిగితే రిజర్వేషన్ల గురించి కూడా అడుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై విపక్షాల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

