ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్కు అమెరికా జ్యూరీ గట్టి షాక్ ఇచ్చింది. 2022లో ట్విట్టర్ కొనుగోలు సమయంలో పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలపై కాలిఫోర్నియా ఫెడరల్ జ్యూరీ మస్క్ను బాధ్యుడిని చేస్తూ తీర్పునిచ్చింది. ఈ పరిణామంతో ఆయన దాదాపు 2.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 21,000 కోట్లకు పైగా) భారీ పరిహారం చెల్లించాల్సి రావచ్చని తెలుస్తోంది. మస్క్ చేసిన కొన్ని వివాదాస్పద ట్వీట్లు సెక్యూరిటీల నిబంధనలను ఉల్లంఘించాయని జ్యూరీ నిర్ధారించింది.

